Sunday, November 17, 2019

మనం మరచిన మన తెలుగు తొలి వాగ్గేయకారుడు కృష్ణమయ్య- 3


ఒక భక్తుని శాపం మరొక  భక్తుని పిలుపు - అప్పన్న స్వామి శక్తి 


మనం మరచిన కృష్ణయ్య బ్లాగ్ లో భగవంతుడు భక్తుడికి శాపం, భక్తుడు భగవంతుడికి ప్రతి శాపం ఇచ్చిన గాధని  తెలుసుకున్నాము కదా. తననే నమ్మి త్రికరణ శుద్ది గా కొలిచిన తన భక్తుని మాట తిరుగుండదని స్వామి నిరూపించారు స్వామి.కొన్ని వందల సంవత్సరాల తరువాత భక్తుడి కృష్ణయ్య మాట ను నిజం చేశారు స్వామి.దాన్ని గురుంచి ఇక్కడ తెలుసుకుందాము.
తనకే శాపమిచ్చిన కృష్ణమయ్య కు స్వామి ఏ వచన సంకీర్తన తో ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించావో అవే వచనసంకీర్తనలు భవిష్యత్ తరాలకు అందకుండా నీ ఖ్యాతీ మరుగున పడిపోవును అని శాపమిచ్చి అంతర్థానమవుతారు వరాహస్వామి.ఆ క్షణం లో తెలుగు లో తొలి లిఖిత అక్షరాలు రాగి రేఖుల పై లిఖించిన కృష్ణమయ్య కు తన గర్వం పూర్తిగా తొలగిపోయింది. వెంటనే  కృష్ణమాచార్యులు వారు రామానుజులు  వద్దకు వెళ్ళి శరణు వేడారు.భగవంతుడు భక్తుని కి దాసుడేనని ఆయన భక్తునిగా నీవు నోరు జారిన మాటకు తిరుగుండదని ఆలయ అగ్నికి ఆహుతి అవుతుందని అదే సమయాన తన శక్తిని స్వామి నిరూపించుకుంటారని శెలవిచ్చి వెళ్ళారు రామానుజులవారు.
తన తప్పుకు ప్రాధేయపడి పడి అంతరాలయన దుఃఖిస్తున్న కృష్ణమయ్య వద్దకు వచ్చిన స్వామి నీ వచన సంకీర్తన వ్యర్థం కాదని కొంతకాలం తరువాత తిరీగీ వెలుగోలోనికి వస్తాయని అభమిచ్చారు అప్పన్న స్వామి
. తననే నమ్మి త్రికరణ శుద్ది గా కొలిచిన తన భక్తుని మాట తిరుగుండదని స్వామి నిరూపించడానికే తన ఆలయం మీద దండయాత్ర జరిగిన సహించాడు స్వామి.
అదే సమయాన మరో భక్తుని మొర ఆలకించి ఆ దండయాత్రను తిప్పి కొట్టాడు వరాహనృసింహుడు.
ఈ సంఘటన జరిగినప్పుడు ఆలయం లో వుంది స్వామీ ని పిలిచిన  భక్తుడు ,కవి   గోగులపాటి కూర్మనాథ కవి.ఈ కవి గురించి మరియు ఆలయ లో  18 శతాబ్ద ప్రారంభంలో తురష్కర దండయాత్ర జరిగిన ఘటన గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది వున్నారని నా అభిప్రాయము.
కలియుగాన భగవంతుడిని మరో సారి రప్పించిన  ఈ మహాకవి గోగులపాటి కూర్మనాధుల వారు విజయనగర రామతీర్థ గ్రామంలో సుమారు 1720 ప్రాంతంలో జన్మించారు. విద్యాభ్యాసము తరువాత, విజయనగర సంస్థానము యొక్క దేవస్థానాలలో ఉద్యోగిగా రామతీర్థంపద్మనాభంసింహాచలంశ్రీకూర్మం లలో పనిచేశారు. 'వైరి హర రంహ సింహాద్రి నారసింహ ! 'అనే మకుటంతో "సింహధ్రి నారసింహా శతకం" అని 101 పద్యాలు రచించిన పరమ భక్తుడు ఈయన.
18వ శతాబ్ద ప్రారంభంలో తురష్కర దండయాత్ర జరిగిన సమయాన సింహచల ఆలయంలోనే ఉన్నారు కూర్మనాథ కవివర్యులు. తురష్కరులు దక్షిణ దేశ దండయాత్ర లో సింహచల క్షేత్రం పై దండెత్తారు ఆలయాన్ని నిర్బందించారు ఆ సమయాన సింహచల క్షేత్రం లో వారం రోజులు ఆలయం మూతబడింది . తన భక్తుడు కృష్ణమయ్య శాప ఫలితంగా అలా వారం రోజులు అగ్నికి ఆహుతి అవుతందనే మాట అగ్నిహోత్రాలు లేకుండా నిలిచేలా చేసి తన భక్తుని వాక్కు మహత్తును నిజం చేశాడు వరాహానరసింహుడు. వారం రోజుల అలుపెరగని దండయాత్రలో కడకు ఆలయంలోకి ప్రవేశించారు తురష్కరమూక.ఆలయాన్ని నేల మట్టం చేసి నిధులు దోచుకు పోడానికి మహత్తర పన్నాగం పన్నారు.
కళ్యాణమండపం  పై విరుచుకుపడ్డారు, ఆలయంలోని బేడా మండపం రాతిరథం గర్భాలయం పై ఉన్న విగ్రహలు ధ్వంసం చేసే ప్రయత్నంలో కాస్త సఫలమయ్యారనే చెప్పాలి . నాటీ సాక్ష్యాలే నేటికి  ఆలయంలో అక్కడక్కడ శిధిలమైన విగ్రహాలు  మనకి కనిపిస్తాయి.ఆ సమయం లో కూర్మనాధ కవి గారు ఆలయం లోనే వున్నారు.వైరి సంహార అని స్వామి ని ఎలుగెత్తి ఆర్తి తో పిలిచారు స్వామి ని.కూర్మనాధుల వారి మనస్సు దహించుకుపోయింది. వైరి సంహరి నేను అయితే ఒక్కడినే తండ్రి ఏలాగోలా తప్పించుకు పోతా మరి నీ విషయం అలా కాదే 16000 మంది గోపికలు వున్నారు వారి అందరితో ఎలా పారిపోతావు రావయ్యా రా వీరి సంగతి చూడవయ్య అని  ఆర్తి తో పిలిచాడు అప్పన స్వామి ని.భక్తుడు ఆర్తి తో పిలవటం అప్పన స్వామి  రాక పోవటం జరుగుతుందా.పిలవగానే టక్కున వచ్చాడు.అది మామూలుగా కూడా కాదు. తుమ్మదెల గుంపై  నిండైన  చందన విగ్రహం నుండి వచ్చాడు. తురష్కరులను చీల్చి చెండాడటానికి గుమ్మడికాయంత ఆకారన తుమ్మెదల రూపం లో వచ్చాడు. తురష్కరులు అనుకున్నది సాదించకుండానే వచ్చిన దారినే పలాయనం చిత్తగించారు. తురష్కరలను తరిమికొట్టడానికి తుమ్మెదల గుంపు కొండ దిగుతుంటే కారుమబ్బులు సింహాచల గ్రామాన్ని చుట్టుముట్టాయా అన్నంత భయంకరంగా కనిపించాయట .అలా ఆ తుమ్మెదల గుంపు  తురష్కరులను "తుమ్మెదల మెట్ట" వరకు తరిమి కొట్టాయని చరిత్ర చెబుతుంది.ఆ తుమ్మెదల మెట్ట నే ఇప్పటి చావులమదుం . అలా తన భక్తుని శాపంలో భక్తుని మాటను ఇటు తన మహత్తుని నిరూపించుకొని తురష్కర దండయాత్రను తుమ్మెదల రూపంలో తిప్పి కొట్టి కూర్మనాథ కవి వాక్కుని నిజం చేసిన దాసానుదాసుడు సింహచల వరాహలక్ష్మీనృసింహుడు అదే మన సింహాద్రిఅప్పన్న. చావులమదుం(తుమ్మెదల మెట్ట) దగ్గర ఆ తుమ్మెదలు ఒక బిలంలో దూరాయని అదే బిలంలో కృష్ణమయ్య సంకీర్తనలు ఉన్నాయని ఒక ప్రచారం కూడా వుంది. చూద్దాం స్వామి సంకల్ప బలం ఎలా ఉందో.మన కృష్ణయ్య సంకేర్తనలు అన్నీ వెలుగులోకి ఎప్పుడు  తీసుకు వస్తాడో ఆ భక్త సులభుడు అప్పన్నే స్వామికే  వదిలివేద్దాము. 

ఆ సింహాద్రి అప్పన్న అనుగ్రహం  వాళ్ళిద్దరి మీదే కాకుండా మనమీద కూడ ప్రసరించాలని  కోరుతు  సెలవుతీసుకుంటున్నాను . తరువాతి  బ్లాగ్ లో మరియొక ఆసక్తి దాయకమైన విషయం తో కలుద్దాము. 

ఓం శ్రీ భగవాన్ రమణాయ  నమః  


2 comments: