Sunday, September 16, 2018

అవధూత వెంకయ్య స్వామి గుడి -విజయనగరం -3


అవధూత వెంకయ్య స్వామి గుడి -విజయనగరం

స్వామి వారి విగ్రహం 

అవధూత  వెంకయ్య స్వామి వారి ఆలయం ధుని  విజయనగరం లో కూడా ఉంది .స్వామి గుడి ని 2000వ  సంవత్సరం  లో కట్టారు.ఈ గుడి ని స్వామి తన మహాసమాధి తరువాత స్శశరీరం తో  ఒక భక్తునికి దర్శనం ఇచ్చి  అడిగి  మరి కట్టించుకున్నారు.స్వామి  పిలిస్తే  పలికే దైవం. తనని నమ్మేవాళ్ళ కోసం స్వయం గా ఇక్కడ  కొలువై వున్నారు . 



ఈ గుడి విజయనగరం ఆర్‌టి‌సి  కాంప్లెక్ష్ నుండి సుమారుగా  6km దూరం లో జమ్ము నారాయణ పురం లో  కోమటి చెఱువు దాటిన  తరువాత  వుంది.ఈ గుడి పల్లె  వాతావరణము లో హడావిడి కి దూరంగా  కట్టారు.గుడి  యొక్క మెయిన్ గేట్ ని దాటి వెళ్ళగానే స్వామి యొక్క  చిత్రపటాలు  మరియు స్వామి వారి  దివ్య  సూక్తులు  చిత్రించి వుంటాయి.గుడి ఆవరణ  లో దత్తాత్రేయులు మరియు కృష్ణుని విగ్రహములు  చిన్నవి వుంటాయి.అవి దాటి వెళ్ళగానే స్వామి వారి పాలరాతి  విగ్రహము  వున్న ఒక పెద్ద హాల్ వుంటుంది.ఈ హాల్ ముఖద్వారం పై  ఓం నారాయణ  ఆదినారాయణ  అని వ్రాసి వుంటుంది.స్వామి వున్న హాల్ ద్వారం నకు ఎదురుగా ఎడమ పక్కన  ధుని వుంటుంది. గుఢి భవనము కి ఎడమ పక్కన బోజనాల హాల్ పెద్దది వుంటుంది.ఇక్కడ కూడా శనివారం ప్రత్యేకము.ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.ఇక్కడ కూడా గొలగమూడి  లో వలె ధుని చుట్టూ ప్రదక్షిణ  చేసి స్వామి ని దర్శిస్తారు.ఇక్కడ కూడా స్వామి రక్ష గా దారం ఇస్తారు .



గుడి  ఉదయం 5 గంటలకి తెరుస్తారు.పగటి పూట తెరిచే వుంటుంది.ఇక్కడ పూజ చేయటానికి ప్రత్యేకము గా పూజారి వుండరు.స్వామి భక్తుడు మరియి ఈ గుడి కట్టిన మహానుబావుడే  పూజ చేస్తారు.ఈ గుడి కట్టిన భక్తునికి ఈ గుడి కట్టడానికి ముంది స్వామి ఎవరో తెలియది.వారి ఊర్లో వున్న రాముడు గుడి తప్ప ఇంకాయెక్కడికి వెళ్లింది లేదు.ఈ గుడి కట్టిన వారు పూర్వం భవన నిర్మాణ పనులు చేసే మేస్త్రి గా పనిచేసేవారు.వారు  విజయనగరం లో షిర్డీ సాయిబాబా ఆలయం లో ధుని నిర్మాణం చేస్తుండగా  రైతు లా కనిపించే ముసలి పెద్దాయన మేస్త్రి గారికి కి కనిపించి నువ్వు ఈ పనులు ఆపేసి నాకు మరియ ఇంకొంత మందికి అన్నం పెట్టాల్సిన సమయం వచ్చింది అని చెప్పి వెళ్లిపోయారట.పాపం మేస్త్రి గారు స్వామి ని యెప్పుడు చూడలేదు ఆయే.అందుకని అర్థము కాలేదు, ఎవరో కూడా తెలియలేదు.ఎవరో పెద్దాయన  యేదో చెప్పారు అని ఊరకుండిపోయారు.సాయి బాబా గారి గుడి పూర్తి అయిన తరువాత  గుడి కట్టించిన గురువుగారు  సాయి సుందరం మహారాజ్,గుర్ల ,విజయనగరం తో  పాటు మేస్త్రి గారు కూడా  గొలగమూడి వెళ్ళటం తటస్టించింది.అక్కడ స్వామి వారి  చిత్రపటం చూసిన తరువాత తను చూసింది వెంకయ్య స్వామి గారిని అని తెలిసింది.అక్కడ గొలగమూడి  లో ధుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వుండగా మరల స్వామి కనిపించి విజయనగరం లో ఇప్పుడు వున్న ప్రదేశం లో  గుడి కట్టమని ఆదేశించారట. గుడి గురించి స్వామి  గురించి ఎవరన్నా అడిగితే ఈ విషయాన్ని పూజారి గారు ఎంతో నమ్రతతో స్వామి పట్ల అలవికానీ ప్రేమతో చెపుతారు.ఇక్కడ జరిగే ప్రతి  పూజా  కార్యక్రమాలు స్వామి నే స్వయంగా   చేయించుకుంటున్నారు నేను నిమిత్తమాత్రుడను మాత్రమే అని సవినయం గా చెప్పుకుంటారు. నిజమైన  భక్తుడు అనుకునేది ఇదే  కదా చేసేది నేను కాదు చేయించేది ఆ భగవంతుడు” అని .
”నాహం కర్త హరిమ్ కర్త “ ఇదే  కదా భగవంతుని శరణాగతికి కావలిసింది.


ఇక్కడ కూడా గొలగమూడి లో జరిగినట్టు ఆగస్టు నెలలో  22,23,24 స్వామి వారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి.
ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఆలయం లో స్వామి ని దర్శించుకోవచ్చు.ప్రతి శనివారం మరియు గురు పూర్ణిమ రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి.ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది.వెంకయ్య స్వామి భక్తులు విజయనగరం కి దగ్గరిలో వున్నవారు తప్పక చూడవలిసిన ప్రదేశము.

స్వామి  వారి సూక్తులు   :
  • త్రెపేవారికి కాదయ్యా ఆకలై కొంగు  పట్టేవారికి  అన్నం  పెట్టాలయ్య. 
  • అన్ని  జీవులలో  వెంకయ్య వున్నాడని వ్రాసుకో . 
  • మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని  వదలను . 
  • సన్యాసులు ధర్మంగా వుండటంలో గొప్ప ఏముంది ? సంసారంలో ధర్మంగా వుండటమే గొప్ప. 
  • వడ్డీ విషయంలో కూడా ధర్మంగా వుండాలయ్యా 
  • పావలా దొంగిలిస్తే పది రూపాయిలు నష్టం. 
  • లాభంలో భాగమాశిస్తే  పాపంలో కూడా భాగం వస్తుంది. 
  • ఒకరిని పొమ్మనేదానికంటే మనం పోవడం మంచిదయ్య. 
  • కూతురిని కోడలిని సమానంగా చూసుకుంటే దేవుడు కనపడతాడు. 
  • పోయేవాళ్ళని పొనిచ్ఛేదేగదయ్యా 
  • దారం తెగిపోకుండా చూచుకుంటే నేను ఎప్పుడూ మీతోనే వుంటానయ్యా . 
ఓం నారాయణ ఆది నారాయణ.

ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః


No comments:

Post a Comment