Saturday, September 15, 2018

అవదూత శ్రీ గొలగమూడి భగవాన్ వెంకయ్య స్వామి - 1



అవదూత గొలగమూడి వెంకయ్య స్వామి

వెంకయ్య స్వామి
అవదూత అనగా నాశరహితుడు ,శ్రేష్టుడు,సంసారబంధాలు విడిలీంచి వేసినవాడు,తన శరీరం పై యెటువంటి అనురాగము లేనివాడు,నేను అనే అహన్నీ త్వజించిన వాడు అని మన ఉపనిషత్తులు చెపుతున్నాయి.ఆచార వ్యవహారాలు,శుచి అశుచి ,విధి నిషేదాలు లాంటివి యేవి పట్టించుకోకుండా సదా బ్రహ్మానందం  లో మునిగి  సచ్చితానందం  అనుభవిస్తూ  అత్నర్ముఖులై వుంటారు.వీరి సమక్షము లో  జీవులు అనంతమైన ప్రశాంతత ని అనుభవిస్తారు.వారి దర్శన భాగ్యమే జీవుల పాపాలని హరించివేస్తుంది. దత్తాత్రేయ స్వామి ని అవదూత ల పరంపర లో మొదటివానిగా చెప్పవచ్చు. ఈ కోవకి చెందిన అవదూతలే షిర్డీ సాయిబాబా,అక్కల కోట మహారాజ్,చీరాల స్వామి, మన వెంకయ్య స్వామి మొదలైనవారు.
భగవంతుడు అవదూతల రూపంలో భూమి పై సంచరిస్తూ వుంటారని గురు చరిత్ర చెపుతుంది.వారు మనలని రక్షించి  వుద్దరించటానికి భూమి  పైకి వస్తారని భాగవతం చెపుతోంది.ఈ అవదూతలనీ గుర్తించే సామార్ద్యము మనలాంటి వారికి వుండదు.వారు మన మధ్యనే వున్న గుర్తించలేని ఆజ్ణానం మనది.అటువంటి మహోన్నతమైన పరిపూర్ణమైన అవదూత  శ్రీ గొలగమూడి  వెంకయ్య స్వామి.
ఒక సామాన్య రైతు కుటుంబం లో  జన్మించి  యేమి తెలియని ఆ పల్లె  జనాల మద్యనే వుండి  వారి యొక్క కష్టా నష్టాలను  తీర్చి వారి లో ఒకరుగా బతికిన మహానుబావుడు మహా అవదూత  శ్రీ వెంకయ్యస్వామి.స్వామి గురుంచి వ్రాయటానికి ,స్వామి ని గురుంచి చెప్పటానికి మనకి వున్న శక్తి ,అర్హత సరిపోదు.
నేను అనుకోకుండా గొలగమూడి లో స్వామి ఆలయం కి  మూడు సార్లు వెళ్ళటం జరిగింది.అక్కడ స్వామి ఆలయం లో స్వామి సమక్షం లో కలిగిన  ప్రశాంతత , అనుభూతి మాటల లో చెప్పలేనిది.స్వామి యెప్పుడు అంటువుండేవారట “మన గొర్రె మందలో ఎక్కడ వున్న కాళ్ళు పట్టి లాక్కొస్తాను అని”. బహుశా నేను అలాంటి గొర్రెనే  ఎందుకటే గురువు అనుగ్రహం లేనిదే మనం ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేము.ఇప్పటికీ  కూడా స్వామి తనని నమ్మిన వారికి ,భక్తులకు స్వామి స్సశరీరులుగా కూడా దర్శనం ఇస్తువుంటారు మరియు సదా రక్షిస్తూ వుంటారు.
వెంకయ్య స్వామి  చరిత్రను గురించి వ్రాయలంటే చాలా పెద్ద పుస్తకము అవుతుంది.ఇక్కడ స్వామి వారి గురించి కొంత ,స్వామి సమాధి వున్న నెల్లూరు ఆలయం మరియు విజయనగరం లో వున్న స్వామి వారి గుడి గురించి చెపుతాను.
స్వామి వారు నెల్లూరు జిల్లా  నాగవెల్లటూరు అనే పల్లెలో  సోంపల్లి  పెంచలయ్య ,పిచ్చమ్మ అనే పుణ్యదంపతులకు మొదటి సంతానం. స్వామి కి  ఇద్దరు తమ్ములు ఒక చెల్లి వుండేవారు.స్వామి సోదరి పట్ల చాలా ప్రేమని కనపరచేవారు.స్వామి కి రావలిసిన   తన వాటాఆస్తి  మొత్తం తన సోదరికి  ఇచ్చేశారు.స్వామి వారి పుట్టిన తేదీ సరిగ్గా తెలియదు.ఒక భక్తుడు చెప్పిన ప్రకారం ధాత నామ సంవత్సరం లో వచ్చిన కరువు నాటికి స్వామి కి పదమూడు సంవత్సరముల  వయస్సు అని.స్వామి కి 1982 కి వంద సంవత్సరముల పైనే వుంటుంది.
స్వామి వారికి ఇరవైఏళ్ళ వయస్సులో బాగా జ్వరం వచ్చినప్పుడు స్వామి వారి తల్లి తండ్రులు” ఇల్లు వేలం వెయ్యబోతున్నారు  నువ్వు ఎక్కడ వుంటావు అని అడిగితె “ మనకి అప్పులు లేవు కదా ఎందుకు వేలం వేస్తారు “అన్నారట.జ్వరం తీవ్రత వలన మతిబ్రమించటం వలన అలా మాట్లాడుతున్నారనుకోనినాటు వైద్యం ,భూత వైద్యం లాంటివి చేయించారట.కొన్ని రోజుల తరువాత  స్వామి ఇంటి నుండి వెళ్ళిపోయి చాకలి యోగం -మంగలి యోగం అని అరుస్తూ ఊరంతా తిరిగేవారట. స్వామి తన ఊరిలో ఎవరితో కలవక ఎప్పుడు యేదో లోకం లో వుండటం వలన స్వామి యొక్క  అవదూత గుణం ని గుర్తించక పిచ్చి వెంకయ్య అనేవారు.చాకలి యోగం -మంగలి యోగం అంటే మన మనస్సు కి పట్టిన చెడు తలంపులని యెప్పటికప్పుడు పరిశుబ్రం చేసుకోవాలని ఇంకా తలకి పట్టిన చెడు తలపులని కత్తిరించుకోవాలని ఆ విదముగా బోధించేవారు.కానీ స్వామి యొక్క అవదూత తత్వాన్ని అర్థం చేసుకోలేక  పిచ్చి వెంకయ్య అనేవారు.అవదూత ల లక్షణం అంతే   మరి.వారు మనుషులకి దూరం గా వుండటానికి అలా మనలిన్ని మాయ చేస్తూ వుంటారు.
ఆ తరువాత స్వామి పెంచల కోన అడవుల లోకి వెళ్ళిపోయారు.అక్కడే స్వామి కి ఒక మహాత్ముని దర్శనం అయింది అని  అప్పటి నుండి వెంకయ్య స్వామి గా మారారని అంటారు.అప్పుడప్పుడు స్వామి ఊరికి వచ్చేవారు కానీ ఇంటికి వెళ్ళక చెళ్లలోనూ,ఊరిశివార్లలోనూ తిరిగేవారు.ఎవరన్నా ఏమన్నా పెడితే తినేవారు లేదంటే మౌనంగా వుండిపోయేవారు.స్వామి భగవాన్ వెంకయ్య స్వామి గా  కొంతకాలానికి అనేక గ్రామాలు తిరిగి కోటితీర్ధం కి వచ్చి కొన్నాళ్లు వుండి తరువాత పెన్నా బద్వేలు  తిప్ప పై వుండేవారు.కొంత కాలానికి గొలగమూడి గ్రామానికి చేరుకొని అక్కడే  చిన్న పూరిపాకలో  అతి నిరాడంబరముగా  తన జీవితాన్ని గడిపారు.
స్వామి పిలిస్తే పలికే దైవం. స్వామి కి చిన్నప్పటి నుండి అన్నీ జీవుల పట్ల చాలా దయ తో వుండేవారు. తన జీవితం అంతా  ఆ అమాయక పల్లె  ప్రజల కష్టాలు తీర్చటం  కోసమే బ్రతికారు.యెన్నో అద్భుతాలు మహిమలతో మనుషుల బాధలే కాదు మూగజీవాల బాధలు  తీర్చారు.వైద్యం సరిగ్గా లేని ఆ రోజులలో తన మహిమ తో మనుషులకి మరియు మూగజీవాలకి కూడా నయం చేసేవారు.వానలు లేక ఎండలతో అల్లాడుతుంటే వానలు కురిపించారు.స్వామి భక్తులు కష్టాలు చెప్పుకుంటే వేలిముద్రలు వేసి ఇచ్చేవారు.స్వామి ఒక దారాన్ని చూపించారు .ఇవన్నీ స్వామి చరిత్ర లో విపులం గా వుంటాయి.
స్వామి కి చిన్నతనం నుండి ఏకాంతముగా వుండటానికి ఇష్టపడేవారు.స్వామి ఎల్లప్పుడూ “ఓం నారాయణ ,ఆదినారాయణ” అని ఒక కర్ర తంభూరతో పాటలు పాడేవారు. స్వామి వారు షిర్డీ సాయిబాబా ని పెద్దఅన్నయ్య గా భావించేవారు.స్వామి వారి మాటలు వారి భోదలు చాలా సరళముగా అందరికీ అర్ధం అయ్యేతట్టు వుంటాయి.ఎలా అంటే  “నమ్మితే సొమ్ము నమ్మకపోతే  దుమ్ము”,ఎవరన్న స్వామి చెప్పింది వినకపోతే “పోతుంటే పోనిచ్చేదే గదయ్యా  అనేవారు”,”మైసూర్ మహారాజు ని చూస్తే యేమి వస్తుంది అయ్యా మనకున్నదే మనది”,దేవుని సేద్యం చేస్తే  ఆయనే అన్నం పెడతాడు”,ఇలాంటివి యెన్నో స్వామి  చాలా తక్కువగా మాట్లాడేవారు.స్వామి  కూడా  తన పెద్దన్న సాయిబాబా లనే భక్తుల నుండి దక్షిణ కొరటం,తద్వారా తత్వము వుపదేశించేవారు.పలికిన ప్రతి వాక్కు గురు వాక్కే.
స్వామి వారు   24-August-1982 లో  గొలగమూడి లో   మహా సమాధి చెందారు.స్వామే స్వయము గా ఈ ఊరుని యెంచుకొని  ఇక్కడే వుండిపోయారు. ఇక్కడినుండి స్వామి  చుట్టు పక్కల పల్లెలకి వెళ్ళేవారు. స్వామి భక్తులకు ఎక్కువగా  తిరువల్లూరు  వీర రాఘవ స్వామి ని కానీ, కంచి కామాక్షమ్మ ని దర్శించమని చెప్పేవారు.ఒకోసారి  స్వామి నే స్వయముగా భక్తులతో కలిసి  వెళ్ళేవారు.ఇప్పటికి స్వామి పిలిచినవారికి పలికే దైవం ,కొలిచిన వారికి కొంగు బంగారం.
భగవాన్ వెంకయ్య స్వామి  వారి లీలలు,వారి సూక్తులు,వారి చరిత్ర  అపూర్వం.ఇంకా విపులం  గా తెలుసుకోవాలంటే స్వామి వారి నిత్య పారాయణ గ్రంధం ,మాస్టర్ భరద్వాజ గారు రాసిన  “ నేను దర్శించిన  మహాత్ములు -శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర “ చదవొచ్చు.




స్వామి వారి సూక్తులు  కొన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఒక్కక్క  మాట  మనం జీవితంలో  తప్పకుండ  పాటించవలసినవి. 




తరువాత పోస్టు లో నెల్లూరు గొలగమూడి ఆలయం గురించి వ్రాస్తాను.
ఓం నారాయణ ఆది నారాయణ.
ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః.

No comments:

Post a Comment