Friday, October 19, 2018

యాత్ర 04-శ్రీకాకుళం-సంగమేశ్వర దేవాలయం -సంగం



సంగమేశ్వర దేవాలయం -సంగం



శ్రీకాకుళం  జిల్లా లో  వంగర మండలం లో సంగం అనే గ్రామం లో నాగావళి నది ఒడ్డున ఉన్న మరియొక ప్రాచీన ఆలయం సంగమేశ్వర ఆలయం.ఈ ఆలయం  శ్రీకాకుళం  నుండి 56 km దూరంలో రాజాం నుండి 20 km దూరం లో వుంది.ఇక్కడ నాగావళి,సువర్ణముఖి మరియు వేగవతి నదులు కలిసే ప్రదేశం.అలహాబాద్ వలె ఇకడ  త్రివేణి సంగమం జరిగే ప్రదేశం.అందుకనే ఈ ఊరికి సంగం అని పేరు మరియు ఇక్కడ స్వామి వారిని సంగమేశ్వరుడు అని పిలుస్తారు.ఈ శివాలయం  లో వున్న లింగాన్ని శ్రీ కృష్ణుని అన్నయ్య అయిన బలరాముల వారు ప్రతిష్టించారని చెపుతారు.ఈ లింగం ఇక్కడ వున్న పంచలింగాలలో ఒకటి గా చెపుతారు.పంచలింగాలు గురుంచి  పురాణాలలో ఒక కధ ప్రాచుర్యం లో వుంది.
పాండవులకు,కౌరవులకు జరిగిన కురుక్షేత్ర యుద్దం లో శ్రీ కృష్ణుడు పాండవుల వైపు,బలరాముడు కౌరవల పక్షాన నిలబడి యుద్ధం చేశారు.శ్రీకృష్ణుడు పాండవుల వైపు వుండటం వలన బలరాముడు నిరాశ చెంది దేశాటన కి బయలుదేరారు.ఆ ప్రయాణం లో బలరాముడు కలహంది అని రాయగడ దగారకు చేరుకున్నారు.కానీ అక్కడ ప్రజలందరూ నీళ్ళు,ఆహారం లేక కరువు తో భాదపడటం గమనించారు.ఆక్కడి ప్రజల కోసం శివుని కోసం తపస్సు చేయగా శివుడు గంగ ని వరంగా ప్రసాదించారు.బలరాముడు అక్కడ తన నాగలి తో తవ్వగ ఒక జలధార భూమి నుండి ఉద్భవించి నది గా ప్రవహించింది.నాగలి తో  తవ్వినది కావున ఈ నదికి నాగావళి అని పేరు.నాగావళి  ఇప్పటి ఒడిస్సా లోని కలహంది దగగ్ర పుట్టి  శ్రీకాకుళం జిల్లాలో కల్లేపల్లి దగ్గర బంగాళాఖాతం లో కలుస్తోంది.ఈ నాగావళి ఒడ్డున బలరాముడు ఐదు లింగాలను ప్రతిష్టించారని  ప్రతీతి.ఈ లింగాలు వరుసగా
1.కెకెవేశ్వరస్వామి లేదా హటకేశ్వర స్వామి వారి ఆలయం ,పాయకపాడు రాయగడ  ఒడిస్సా.
2.చెన్నకేశ్వర స్వామి /సోమేశ్వర స్వామి వారి ఆలయం గుంప,పార్వతిపురం,ఆంధ్రప్రదేశ్
3.సంగమేశ్వర స్వామి వారి ఆలయం ,సంగం,రేగిడి ఆముదవలస దగ్గర, శ్రీకాకుళం ,ఆంధ్ర ప్రదేశ్.
4.ఉమా రుద్ర కోటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీకాకుళం ,ఆంధ్రప్రదేశ్
5. మణి నాగేశ్వర స్వామి వారి ఆలయం,కల్లేపల్లి , శ్రీకాకుళం ,ఆంధ్రప్రదేశ్.

ఈ పంచలింగాలలో ఒకటి అయిన  సంగమేశ్వర ఆలయం నిర్మాణ శైలి కళింగ నిర్మాణ శైలి లో వుంటుంది.త్రివేణి సంగమం కావటం వలన పర్వదినాలలో,కార్తీక మాసం లో మరియు మహా శివరాత్రి రోజు భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారు.ఈ ఆలయం లోపల ఒక గుహ ఆముదలవలస వరకు వుంది.పట్టణ హడావిడి కి దూరంగాపల్లె వాతావరణం లో చాలా ప్రశాంతంగా ఉంటుంది.పరవదినాలలో కాకుండా మములరోజులలో వెళితే బావుంటుంది.
నాగావళి 

సంగం కి చేరుకోవటానికి ముందు గా పాలకొండ,రాజాం లేదా సీతాం పేట గాని వచ్చి అక్కడ నుండి సంగం కి ఆటొ కానీ APRTC బుస్సులో కానీ వెళ్లవచ్చు.

 ఓం  శ్రీ భగవాన్ రమణాయ నమః 

1 comment: