Saturday, October 20, 2018

యాత్ర 07-శ్రీకాకుళం- శాలిహుండం


శాలిహుండం

శ్రీకాకుళం లో హిందూ దర్మం తో పాటు బౌద్దంమతం కూడా బాగా  వర్ధిలింది అని  శాలిహుండం ద్వారా మనకు తెలుస్తుంది.శాలిహుండం ఒక  చరిత్రాత్మక విశిష్టిత కలిగిన బౌద్ధ క్షేత్రం.శాలిహుండం  శ్రీకాకుళం జిల్లా లో గార మండలం లో ఉంది.
ఈ బౌద్ధ క్షేత్రం వంశధార నది ఒడ్డున వున్న బౌద్ద ఆరామాలు మరియు శిథిలమైన  పురాతన దేవాలయాలతో ఉన్న పర్యటక ప్రాంతం.శాలిహుండం కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందటానికి మంచి అవకాశం ఉన్న అందమైన చరిత్రాత్మ బౌద్ధ క్షేత్రం.ఈ క్షేత్రాన్ని మొదట 1919 లో గిడుగు రామ్మూర్తి పంతులు గారు కనుగొన్నారు.

శాలిహుండంకి పూర్వం శాలివాటిక(బియ్యపు ధాన్యాగారము) అని శల్యపేటిక అని అనేవారు.శాలిహుండం లో కనిపించే బౌద్ధ శిధిలాలు బౌద్ధ మతపు చివరి కాలానికి చెందినవి గా చెప్పవచ్చు.ఆన్ని బౌద్ధక్షేత్రాలన్నే ఇధి కూడా కొండపైనే ఉంటుంది.ఇక్కడి తవ్వకాలలో శల్యపేటికలు, నాలుగు స్థూపాలు, ఒక చైత్య గృహము మరియు అనేక శిల్పాలు బయల్పడినవి. క్రీ.పూ.2వ శతాబ్దము నుండి 12వ శతాబ్దము వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు థేరవాద, మహాయాన మరియు హీనయాన మొదలైన మూడు బౌద్ధాల యొక్క ప్రభావాల్ని ప్రతిబింబిస్తున్నాయి.

ఇక్కడ తార మరియు మారిచి విగ్రహాలు తవ్వకాలలో దొరికాయి.ఇక్కడి నుండి సుమత్ర దీవులకు మరియు తూర్పు దేశాలకు బౌద్దం విస్తరించినట్టు  తెలుస్తుంది.ఈ స్మారక కట్టడాలన్నీ నాలుగు స్తూపాలపై నిర్మించారు.కొండకి కుడువైపున వృత్తాకార స్తూపం ఉంటుంది.మెట్లవంటి నిర్మాణం తో కూడిన వృత్తాకార మరియు దీర్ఘచతురస్రాకార స్తూపాలు, మండప స్తంభాలు బౌద్ద శైలి లో నిర్మించారు.అన్నిటికంటే పెద్ద స్తూపం వృత్తాకారంలో కొండ చివరి బాగాన నిర్మించారు.
2011 లోబుద్దుని ఏకశిలా విగ్రహం తవ్వకాలలో బయటపడింది. పరిచారికలు వింజామరలు విసురుతుండగా బుద్ధుడు వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఏక శిలావిగ్రహం వెలుగు చూసింది. ప్రస్తుతం బుద్ధుని కొండ గుట్ట పైన నుయ్యి వంటి ప్రదేశం మాదిరే వేణుగోపాలుని కొండ పై కూడా పడమటి భాగ శిఖరాగ్రాన ఉండి అక్కడ ఈ విగ్రహం వెలుగుచూసింది.
శాలిహుండం శ్రీకాకుళం కి 20KM దూరంలో ఉంది. శ్రీకాకుళం నుండి గార కి ప్రతి 30 నిమిషాలికి  బస్సులు ఉన్నాయి .అక్కడి నుండి 3KM దూరంలో ఉంది.
ఓం శ్రీభగవాన్ రమణాయ నమః

1 comment:

  1. శ్రీకాకుళం చారిత్రాత్మకంగా చాలా ప్రాచీనమైనది అనీ ఇది చదివాక అర్ధమౌతుంది ...

    ReplyDelete